
మెదక్, వెలుగు: హవేలి ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి కి చెందిన పలువురు రైతులు శనివారం జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. కాంగ్రెస్ నాయకులు గంగా నరేందర్, సర్పంచ్ రాజిరెడ్డి, అడ్వకేట్ జీవన్ రావ్, పరుశరాం గౌడ్, బొజ్జ పవన్ వారికి మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..
బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తేనే పోడు పట్టాలు వస్తాయని లేదంటే అక్రమంగా అటవీ భూమి కబ్జా చేశారని కేసులు పెట్టిస్తామని కొందరు నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.